19 నుంచి పాలిటెక్నిక్ మెర్సీచాన్స్ పరీక్షలు
ABN , First Publish Date - 2021-04-13T06:20:55+05:30 IST
19 నుంచి పాలిటెక్నిక్ మెర్సీచాన్స్ పరీక్షలు
భారతీనగర్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ మెర్సీచాన్స్ పరీక్షలను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ పరీక్షా కేంద్రంగా నిర్వహించనున్నట్లు కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.శివప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ విద్యా కోర్సుల్లో ఆర్సీ/ఎన్సీ సీ-90, సీ-96, సీ-00, సీ-05, సీ05 (సీసీసీ), సీ-08 స్కీములకు సంబంధించిన విద్యార్థులు ఎస్బీటెట్ పోర్టల్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈనెల 19 తేదీ నుంచి జరిగే పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.