‘పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి’
ABN , First Publish Date - 2021-04-11T05:04:09+05:30 IST
పరిషత్ ఎన్నికల్లో మోర్త దళితవాడ పోలింగ్ బూత్ వద్ద బయట ఏర్పాటు చేసే గుర్తుల పోస్టర్లో బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మను అంటించలేదని బీఎస్పీ నిడదవోలు నియోజకవర్గ కోశాధికారి, జడ్పీటీసీ అభ్యర్థి మర్రి మహాలక్ష్ముడు ఆరోపించారు
ఉండ్రాజవరం, ఏప్రిల్ 10 : పరిషత్ ఎన్నికల్లో మోర్త దళితవాడ పోలింగ్ బూత్ వద్ద బయట ఏర్పాటు చేసే గుర్తుల పోస్టర్లో బీఎస్పీ ఎన్నికల గుర్తు ఏనుగు బొమ్మను అంటించలేదని బీఎస్పీ నిడదవోలు నియోజకవర్గ కోశాధికారి, జడ్పీటీసీ అభ్యర్థి మర్రి మహాలక్ష్ముడు ఆరోపించారు. ఈ మేరకు కొవ్వూరు ఆర్డీవోకు ఫిర్యాదు చేశామని శనివారం ఆయన విలేకరులకు తెలిపారు. విచారణ చేపట్టి పోలింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు.