సంక్షోభ పరిష్కారానికి మోదీ పుతిన్‌తో మాట్లాడాలి: ఉక్రెయిన్

ABN , First Publish Date - 2022-02-24T20:09:04+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది.

సంక్షోభ పరిష్కారానికి మోదీ పుతిన్‌తో మాట్లాడాలి: ఉక్రెయిన్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది. మోదీ ప్రపంచంలోనే శక్తిమంతమైన నేత అని ఆయన మాట్లాడితే పుతిన్ వింటారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి చేయిదాటిపోతోందని, మోదీ సాయం చేయాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి పొలిఖా కోరారు. ప్రపంచంలో శాంతి తీసుకొచ్చే సత్తా భారత్‌కే ఉందని ఆయన అన్నారు. ఉక్రెయిన్‌లో 20 వేల మంది భారతీయ విద్యార్ధులున్నారని, వారిలో కొందరు యుద్ధం కారణంగా చిక్కుకుపోయారని పొలిఖా వెల్లడించారు. 



Updated Date - 2022-02-24T20:09:04+05:30 IST