కడుపు నొప్పితో మెలికలు తిరిగిన 11 ఏళ్ల బాలిక.. వెంటనే ఆస్పత్రికి తరలింపు.. అక్కడ జరిగింది చూసి కుటుంబ సభ్యులు షాక్!
ABN , First Publish Date - 2021-12-08T17:27:25+05:30 IST
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 11 ఏళ్ల బాలిక..
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో 11 ఏళ్ల బాలిక.. ఒక శిశువుకు జన్మనివ్వడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆ బాలిక తాను గర్భం దాల్చినప్పటికీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులెవరికీ చెప్పకపోవడం విశేషం. ఈ ఉదంతం పోలీసుల వరకూ చేరడంతో దర్యాప్తు ప్రారంభమయ్యింది. ఈ ఘటన ఖెర్వాడా గ్రామంలో చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలికకు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు డిసెంబరు 4న డూంగర్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ ఆ బాలిక ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు తెలియజేశారు. వెంటనే వారు ఆసుపత్రికి చేరుకుని ఆ బాలిక తండ్రి రమేష్, వారి బంధువు రుషభ్ దేవ్లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన నిందితుడు రుషభ్ దేవ్ గుజరాత్లో కూలీ పనులు చేస్తుంటాడని, రమేష్కు బంధువు అయినందున రుషభ్ దేవ్ వారి ఇంటికి తరచూ వస్తూపోతూ ఉంటుంటాడన్నారు. ఈ నేపధ్యంలో ఆ చిన్నారిని ప్రలోభాలకు గురిచేసి, అత్యాచారం చేశాడు. ఈ కారణంగా ఆ చిన్నారి గర్భం దాల్చిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.