పట్టు వీడని పోలీసులు

ABN , First Publish Date - 2021-01-14T06:33:07+05:30 IST

పట్టు వీడని పోలీసులు

పట్టు వీడని పోలీసులు
ఉప్పలూరులో బందోబస్తు

కంకిపాడు, జనవరి 13 : కోడి పందెం, పేకాట శిబిరాల పోలీసులు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.మండలంలోని ఈడుపుగల్లు, ఉప్పలూరు, గొడవర్రు గ్రామాల్లో బరుల ఏర్పాటు పం దెం రాయుళ్లు సర్వ సన్నద్ధమవుతున్నారు... పోలీసులు వాటిని భగ్నం చేస్తున్నారు. ఒకానక సమయంలో  ఎమ్మెల్యే సారథి ఉప్పలూరు బరుల వద్దకు చేరుకుంటున్నారన్న సమాచారంతో పోలీసులు బందోబస్తు పెంచారు. తూర్పు జోన్‌ ఏసీపీ విజయ్‌పాల్‌, కంకిపాడు, గన్నవరం, ఉయ్యూరు, పెనమలూరు సీఐలు చేరుకున్నారు. ఎస్సై దుర్గారావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఫ విజయవాడ రూరల్‌ :  మండలంలో కోడి పందేలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఎక్కడా పందేలు జరగ లేదు. భోగి రోజున పందేలకు అనుమతి వస్తుందని అధికార వైసీపీ నాయకులు భావించినప్పటికీ, సీపీ శ్రీనివాసులు అందుకు గండికొట్టారు. నున్న, పాతపాడు, కొత్తూరు తాడేపల్లిలో ఏర్పాటు చేసిన కోడి పందేల బరులను అధికారులు ధ్వంసం చేశారు.  కొత్తపేట సీఐ ఉమర్‌, నున్న రూరల్‌ సీఐ ఎం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. 

Updated Date - 2021-01-14T06:33:07+05:30 IST