వినాయక విగ్రహాలు ఊరేగిస్తే కఠిన చర్యలు.. : పోలీస్‌ కమిషనర్‌ వార్నింగ్

ABN , First Publish Date - 2021-09-06T19:48:18+05:30 IST

నగరంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వినాయక విగ్రహాలు ఊరేగించే..

వినాయక విగ్రహాలు ఊరేగిస్తే కఠిన చర్యలు.. : పోలీస్‌ కమిషనర్‌ వార్నింగ్

చెన్నై/ఐసిఎఫ్‌ : నగరంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి వినాయక విగ్రహాలు ఊరేగించే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ హెచ్చరించారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా బహిరంగ స్థలాల్లో వినాయక చతుర్ధి వేడుకల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించిందని, దీనికి సంబంధించి హిందూ సంఘాలతో చర్చలు జరిపామని తెలిపారు. వినాయక చవితి రోజున పోలీసు భద్రత, నిఘా కట్టుదిట్టం చేయనున్నామని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఊరేగింపులు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని కమిషనర్‌ హెచ్చరించారు.



Updated Date - 2021-09-06T19:48:18+05:30 IST