ఇంటి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-11-25T05:28:40+05:30 IST

ఇంటి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు

ఇంటి యజమానిపై పోలీసులకు ఫిర్యాదు

ధారూరు: కెరెల్లిలో అనుమతి లేకుండా విద్యుత్‌ స్తంభాన్ని లోపలికి వేసి  ఇంటి నిర్మాణానికి స్లాబ్‌ వేసిన యజమాని పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ట్రాన్స్‌కో ఏఈ ఆనంద్‌ తెలిపారు. గ్రామంలో చాకలి శివయ్య ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఇంటి నిర్మాణ స్థలంలో తమ విద్యుత్‌లైన్‌ ఉంది. తమకు తెలియకుండానే యజమాని విద్యుత్‌ స్తంభాన్ని మధ్యలో వేసి స్లాబ్‌ వేసి ఇంటిని నిర్మించుకుంటున్నాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విద్యుత్‌లైన్‌లో ఏమైనా ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరిగితే తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయమై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కాగా పంచాయతీ అనుమతి లేకుండానే ఇంటి నిర్మాణం జరుగుతున్నా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. 

Updated Date - 2020-11-25T05:28:40+05:30 IST