రక్తదానం ప్రాణదానంతో సమానం
ABN , First Publish Date - 2021-10-29T05:17:51+05:30 IST
రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ సీహెచ్ విజయరావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని ఉమేష్చంద్ర సమావేశ మందిరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఎస్పీ విజయరావు
నెల్లూరు(క్రైం), అక్టోబరు 28: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ సీహెచ్ విజయరావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలోని ఉమేష్చంద్ర సమావేశ మందిరంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వీటిని ఎస్పీ ప్రారంభించి ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో నెల్లూరు నగరంలో 150, నాయుడుపేటలో 100, కావలిలో 150, ఆత్మకూరులో 150 కలిపి మొత్తం 550 యూనిట్ల రక్తం సేకరించామని చెప్పారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది అధిక సంఖ్యలో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పీ వెంకటరత్నం, డీఎస్పీలు కోటారెడ్డి, శ్రీనివాసరెడ్డి, గాంధీ, సుభానీ, డాక్టర్ సునీల్బాబు, పోలీసు సంఘం అధ్యక్షుడు ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.