మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్

ABN , First Publish Date - 2021-07-30T00:12:22+05:30 IST

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల అలర్ట్

మంచిర్యాల: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రాణహిత వంతెన వద్ద డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ పర్యవేక్షించారు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ఈ కార్యక్రమాన్ని మావోయిస్టులు నిర్వహిస్తున్నారు. 1972 జూలై 28న చారు మజుందార్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోగా, 1982 జూలై 18న కన్హాయ్‌ చటర్జీ పోలీసు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. వీరి జ్ఞాపకార్థం 1980 నుంచి అప్పటి సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌, ప్రస్తుత సీపీఐ మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కూంబింగ్‌ ముమ్మరం చేశారు. 

Updated Date - 2021-07-30T00:12:22+05:30 IST