AP News: ప్రభుత్వ పథకాలను వివరించిన పోలవరం ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-08-24T03:15:03+05:30 IST
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): ఏలూరు జిల్లా, పోలవరం (Polavaram) నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం ’ కార్యక్రమం జరుగుతోంది. 39వ రోజు కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయం పరిధిలోని వంగ
జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): పోలవరం (Polavaram) నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ 39వ రోజు కార్యక్రమం జరిగింది. కొయ్యలగూడెం మండలం సరిపల్లి సచివాలయం పరిధిలోని వంగ బొత్తప్ప గూడెం, మర్రిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (MLA Balaraju) పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన ప్రజలకు వివరించారు. బాలరాజు వెంట జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, ఎంపీపీ గంజిమాల రామారావు, గొడ్డాటీ నాగేశ్వర రావు, తుమ్మలపల్లి గంగరాజు, మట్టా సత్తి పండు, మందపాటి కుమారి, స్థానిక ఎంపీటీసీ బండి సీతారత్నం, స్థానిక సర్పంచ్ గోపి, మందపాటి రామకృష్ణ, దూలపల్లి కాంతారావు, మద్దు సతీష్, జన్నే రాజేష్, తాడేపల్లి మధు, మన్యం రమణ, గణేష్, సిరిబతుల పోసియ్య, రాం ప్రసాద్, పల్లయ్య, చిక్కాల దుర్గా ప్రసాద్, బాజీ, సర్పంచులు తుక్కయ్య, గడ్డియ్య, అధికారులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, వార్డు మెంబర్లు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.