పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూత
ABN , First Publish Date - 2021-07-14T14:33:36+05:30 IST
పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన వంకా
ఏలూరు: పోలవరం మాజీ ఎమ్మెల్యే వంకా శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన వంకా శ్రీనివాస్ ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. గత నెలలో కరోనాతో శ్రీనివాస్ భార్య సత్యవతి మృతి చెందారు. 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గెలుపొందారు. శ్రీనివాస్ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.