పోలవరంలో కాంక్రీటు పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-11-25T05:06:35+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన గ్యాప్‌–3 కాంక్రీటు పనులను మంగళవారం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రారంభించింది.

పోలవరంలో కాంక్రీటు పనులు ప్రారంభం
పోలవరం ప్రాజెక్టు గ్యాప్‌ 3లో కాంక్రీటు పనులు జరుగుతున్న దృశ్యం

పోలవరం, నవంబరు 24 : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన గ్యాప్‌–3 కాంక్రీటు పనులను మంగళవారం మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేకి ఎడమ వైపున వున్న కొండపై జరుగుతున్న ఈ గ్యాప్‌ 3 పనులలో 148 మీటర్ల పొడవునా 55 మీటర్ల ఎత్తున కాంక్రీటు డ్యాం నిర్మించనున్నారు. ఈ కాంక్రీటు డ్యాం నిర్మాణానికి దాదాపు 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వినియోగించనున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. గ్యాప్‌ 3 ప్రాంతంలో మట్టి తవ్వకం, కొండరాయి తొలగింపు పనులు పూర్తి కావడంతో కాంక్రీటు పనులను ప్రారంభించారు. ఈ కాంక్రీటు డ్యామ్‌ను మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2020-11-25T05:06:35+05:30 IST