ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రంపై విరుచుకుపడ్డ దేవెగౌడ

ABN , First Publish Date - 2020-09-20T18:54:48+05:30 IST

రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే దేవెగౌడ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ

ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కేంద్రంపై విరుచుకుపడ్డ దేవెగౌడ

న్యూఢిల్లీ : రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే దేవెగౌడ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను ఆమోదింప జేసుకోవడంలో మోదీ ప్రభుత్వానికి ఎందుకింత తొందర? అని నిలదీశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మోదీ ప్రభుత్వం ఎందుకింత తొందర పెడుతోందంటూ నిలదీశారు. ప్రస్తుత కాలంతో పాటు రాబోయే కాలాల్లో ఈ బిల్లులు రైతులకు ఎలా ఉపయోగపడతాయో స్వయంగా ప్రధాని మోదీ వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి ఈ బిల్లులు ఎలా ఉపయోగపడతాయో చెప్పాలని దేవెగౌడ మోదీని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-09-20T18:54:48+05:30 IST