కరోనా పరిస్థితులపై చర్చించేందుకు సీఎంలతో మోదీ మరోమారు భేటీ

ABN , First Publish Date - 2020-09-20T12:22:15+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలోని కరోనా...

కరోనా పరిస్థితులపై చర్చించేందుకు సీఎంలతో మోదీ మరోమారు భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ వచ్చేవారంలో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. పీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాలలోని కరోనా పరిస్థితులపై చర్చించనున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశం సెప్టెంబరు 23న జరిగే అవకాశాలున్నాయి.


ఈ సమావేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారని తెలుస్తోంది. గతంలో ఆగస్టు 11న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని ఆయా ప్రాంతాల్లోని కరోనా వైరస్ పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-20T12:22:15+05:30 IST