తెలుగువారికి మోదీ ఉగాది శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-04-13T18:02:41+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా

తెలుగువారికి మోదీ ఉగాది శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలందరికీ ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆయన ట్విటర్ వేదికగా తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరికీ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు. తెలుగువారంతా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. 


ఈ ప్రత్యేకమైన పండుగ ఆశావాదం, నూతన ప్రారంభాలకు సంబంధించినదని పేర్కొన్నారు. ఈ ఉగాది అందరికీ సమృద్ధిగా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2021-04-13T18:02:41+05:30 IST