రాజ్యసభకు కొందరు బీజేపీ ఎంపీలు డుమ్మా... జాబితా కోరిన ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2021-08-10T17:48:59+05:30 IST

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి.

రాజ్యసభకు కొందరు బీజేపీ ఎంపీలు డుమ్మా... జాబితా కోరిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ: ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తున్నాయి. సోమవారం రాజ్యసభలో ఒకానొక సందర్భంలో విపక్షాలు ఒక బిల్లును సెలెక్ట్ కమిటీ దగ్గరకు పంపాలని డిమాండ్ చేశాయి. ఇందుకోసం ఓటింగ్ అవసరమయ్యింది. అయితే ఈ సమయంలో కొంతమంది బీజేపీ ఎంపీలు సభలో లేరు. దీనిని గమనించిన ప్రధాని నరేంద్రమోదీ సభలో లేని బీజేపీ సభ్యుల జాబితాను కోరారు. ఈరోజు సభ ప్రారంభానికి ముందు బీజేపీ పార్లమెంటు సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ...రాజ్యసభ సమావేశాలకు హాజరుకాని సభ్యుల జాబితాను ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-08-10T17:48:59+05:30 IST