ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ!
ABN , First Publish Date - 2021-09-05T15:27:55+05:30 IST
దేశవ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు... ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రథమ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ను గుర్తుచేసుకున్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వట్టర్ ఖాతా ద్వారా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. యువత మానసిక వికాసాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. కరోనా మహమ్మారి కాలంలోనూ ఉపాధ్యాయులు తమ సేవలను అందించారన్నారు. ఎస్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని, ఆయన దేశానికి చేసిన సేవలు మరువరానివన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.