మోదీ అబద్ధం చెబుతూ... మోసం చేస్తున్నారు : రాహుల్

ABN , First Publish Date - 2020-07-11T22:07:12+05:30 IST

చైనాతో తలెత్తిన ఘర్షణపూరిత వాతావరణంపై ప్రధాని మోదీ ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ

మోదీ అబద్ధం చెబుతూ... మోసం చేస్తున్నారు : రాహుల్

న్యూఢిల్లీ : చైనాతో తలెత్తిన ఘర్షణపూరిత వాతావరణంపై ప్రధాని మోదీ ఇంకా అబద్ధాలు ప్రచారం చేస్తూ, దేశాన్ని మోసం చేస్తూనే ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ సరిహద్దులను గానీ, దేశ రక్షణను గానీ బలహీనపరిచే ఏ చర్యకూ తమ పార్టీ మద్దతు ఉండదని ప్రకటించారు. కోవిడ్-19ను ఎదుర్కొనే విషయంలో రాహుల్ కేంద్ర సర్కార్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.


కరోనాను ఎదుర్కొనే విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర సహాయం అవసరమైన సమయంలో సర్కార్ చల్లగా జారుకుందని విమర్శించారు. ‘‘చైనా విషయంలో మోదీ అబద్ధాలాడుతూనే ఉన్నారు. ఈ వ్యవహారం రాజకీయానికి సంబంధించింది కాదు. దేశ సరిహద్దుల విషయంలో, దేశ భద్రత విషయంలో మేం కఠినంగానే ఉంటాం.’’ అని రాహుల్ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-07-11T22:07:12+05:30 IST