ప్లీనరీని విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-07-02T05:00:06+05:30 IST
వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశా ల్లో పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొ ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, నగర మేయర్ కె.సురే్షబాబు సంయుక్తంగా పిలుపునిచ్చారు.
డీప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్బాబు
కడప(ఎర్రముక్కపల్లి), జూలై1: వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశా ల్లో పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొ ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, నగర మేయర్ కె.సురే్షబాబు సంయుక్తంగా పిలుపునిచ్చారు. మున్సిపల్ గ్రౌం డ్స్లో శనివారం జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించిన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి వైసీపీ ప్లీనరీ సమావేశాలను నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశాలకు జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర చైర్మన్లు, వారు ఇచ్చే సందేశాలను విని భవిష్యత్తులో ప్రజల్లోకి వెళ్లాలని ఈ ప్లీనరీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమాల్లో వైసీపీ నేతలు కార్పొరేషన్ కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.