ప్లీజ్‌..ప్లాస్టిక్‌ వాడకండి

ABN , First Publish Date - 2022-07-03T05:58:10+05:30 IST

ప్లీజ్‌ ప్లాస్టిక్‌ వాడకండి..అంటూ జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రజలకు పూలు అందజేస్తూ కోరింది.

ప్లీజ్‌..ప్లాస్టిక్‌ వాడకండి
పూలు అందజేస్తూ అవగాహన కల్పిస్తున్న చైర్‌ పర్సన్‌

ప్రజలకు పూలు అందజేస్తూ కోరిన బల్దియా చైర్‌ పర్సన్‌ 

జగిత్యాల టౌన్‌, జూలై 2: ప్లీజ్‌ ప్లాస్టిక్‌ వాడకండి..అంటూ జగిత్యాల బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి ప్రజలకు పూలు అందజేస్తూ కోరింది. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేంధించాలని కోరుతూ జగిత్యాల బల్దియా ఉద్యోగుల ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీని నిర్వహించారు. బల్ది యా చైర్‌ పర్సన్‌ శ్రావణి హాజరై ర్యాలీలో పాల్గొని ప్రజలకు ప్లాస్టిక్‌ వాడ కం వల్ల కలిగే అనర్థాలపై అవగాహనతో పాటు కరపత్రాలు పంపిణీ చేశా రు. పూలు అందజేస్తూ ప్లాస్టిక్‌ను వాడవద్దని కోరారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ శ్రావణి, కమిషనర్‌ స్వరూప రాణిలు మాట్లాడుతూ ప్లాస్టిక్‌ రహిత జగిత్యాలగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.  ప్లాస్టిక్‌ ఉపయోగంతో మానవాళికి ముప్పుందని, పూర్తిగా నిషేధించి భావి తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు ధర్మరాజు, వొద్ది శ్రీలత ఉన్నారు.

ఫజిల్లా కేంద్రంలో శనివారం వేకువ జామున పారిశుధ్య పనులను చైర్‌ పర్సన్‌ బోగ వ్రావణి తనిఖీ చేశారు. అనంతరం కార్మికుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌ పర్సన్‌ శ్రావణి మాట్లాడు తూ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేలా కార్మికులు అంకితభావం తో పనిచేయాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Updated Date - 2022-07-03T05:58:10+05:30 IST