నోయిడాలో పెరిగిన కోవిడ్ కేసులు

ABN , First Publish Date - 2021-05-12T23:08:04+05:30 IST

నోయిడాలో పెరిగిన కోవిడ్ కేసులు

నోయిడాలో పెరిగిన కోవిడ్ కేసులు

లక్నో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని నోయిడాలోని ప్లేస్కూల్ ను కోవిడ్ కేంద్రంగా మార్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కోవిడ్ -19 కేసుల పెరుగుదల నేపథ్యంలో నోయిడా అధికారులు ఒక ప్లేస్కూల్‌ను కోవిడ్ కేంద్రంగా మార్చాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు జూన్ 30 వరకు మంథన్ స్కూల్ కోవిడ్ కేంద్రంగా పనిచేయనుంది. గౌతమ్ బుద్ధ నగర్ లో మంగళవారం సాయంత్రం నాటికి 1,229 కేసులు, 12 మరణాలు నమోదైనట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-12T23:08:04+05:30 IST