17 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-01-25T06:48:55+05:30 IST

కైకలూరు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ ఆదివారం కొల్లేరు గ్రామాల్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు.

17 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

కైకలూరు : కైకలూరు రూరల్‌ ఎస్సై టి.రామకృష్ణ ఆదివారం కొల్లేరు గ్రామాల్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించి 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయం సమీపంలో పేకాట శిబిరంపై దాడి చేసి 15 మందిని అరెస్టు చేసి రూ. 68,000, శృంగవరప్పాడులో పేకాట శిబిరంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూ.17,200 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.  

Updated Date - 2021-01-25T06:48:55+05:30 IST