HYD : బాబోయ్.. రైల్వే ప్లాట్ఫాం టికెట్ ధర డబుల్..
ABN , First Publish Date - 2022-01-08T14:37:26+05:30 IST
బాబోయ్.. రైల్వే ప్లాట్ఫాం టికెట్ ధర డబుల్..
హైదరాబాద్ సిటీ/బర్కత్పురా : కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కు పెంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో ఫ్లాట్ఫాంపై ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 20 వరకు ఇదే ధర కొనసాగనుంది. కాగా, ప్రస్తుతానికి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధర మారలేదు.