టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వండి

ABN , First Publish Date - 2020-09-30T09:21:16+05:30 IST

త్వర లో జరగనున్న హైదరాబా ద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్..

టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇవ్వండి

మంత్రి కేటీఆర్‌ను కోరిన పీఎల్‌.శ్రీనివాస్‌


రాంనగర్‌, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): త్వర లో జరగనున్న హైదరాబా ద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ప్రముఖ విద్యావేత్త పీఎల్‌.శ్రీనివాస్‌ మంగళవారం మంత్రి కేటీఆర్‌ను ఆయన వ్యక్తిగతంగా కలిసి తన అభ్యర్థనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాను 2007లో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ తనకు అవకాశం కల్పిస్తే విజయం సాధిస్తానని మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు తెలిపారు.


పట్టభద్రుల సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉం దని, తనకు అవకాశం కల్పిస్తే పట్టభద్రుల మద్దతును కూడగట్టుకుని గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను వివిధ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకు లు, టీచర్లు, పూర్వ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో సమావేశాలు నిర్వహించానని తెలిపారు. వచ్చే నెల 1 నుంచి నవంబర్‌ 6 వరకు జరిగే ఓటర్ల నమోదుపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ విన్నపంపై మంత్రి కేటీఆర్‌ స్పంది స్తూ మీరు పని చేస్తూ ముందుకెళ్లండి అని వ్యాఖ్యానినట్లు శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2020-09-30T09:21:16+05:30 IST