సింహాన్ని దత్తత తీసుకున్న PJR కుమార్తెలు

ABN , First Publish Date - 2021-12-28T14:39:59+05:30 IST

హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మాస్‌ లీడర్‌గా పేరుగాంచిన..

సింహాన్ని దత్తత తీసుకున్న PJR కుమార్తెలు

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో మాస్‌ లీడర్‌గా పేరుగాంచిన దివంగత మాజీ సీఎల్పీ నేత పి.జనార్ధన్‌ రెడ్డి పేరుమీద ఆయన కుమార్తెలు జూపార్కులోని ఏషియాటిక్‌ సింహాన్ని దత్తత తీసుకున్నారు. పీజేఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కార్పొరేటర్‌ విజయారెడ్డి, పావనీరెడ్డి జూపార్కు క్యూరేటర్‌ రాజశేఖర్‌ను కలిసి సింహం దత్తత, పోషణ, ఆహారం కోసం లక్ష రూపాయల చెక్కులను అందజేసి అంగీకార పత్రాలను పొందారు. డిసెంబర్‌ 21నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఆసియా సింహాన్ని దత్తత తీసుకుంటున్నట్లు విజయారెడ్డి తెలిపారు. పీజేఆర్‌ 14వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్లు కుమార్తెలు తెలిపారు.



Updated Date - 2021-12-28T14:39:59+05:30 IST