గండ్లు పూడ్చివేత పనుల్లో భారీగా అవినీతి

ABN , First Publish Date - 2021-08-04T05:17:43+05:30 IST

గొల్లప్రోలు, ఆగస్టు 3: ఏలేరు, పీబీసీ కాలువలకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్లో భారీ అవినీతి జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణంలోని టీడీపీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు కార్యాలయం లో మంగళవారం జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ నేతలు, ఇరిగేషన్‌ అధికారులు కుమ్మక్కై పనులు సరి గా చేయలేదన్నారు. మట్టి, గ్రావెల్‌తో పూడ్చాల్సిన గండ్లును ఇ

గండ్లు పూడ్చివేత పనుల్లో భారీగా అవినీతి
గొల్లప్రోలు సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, ఆగస్టు 3: ఏలేరు, పీబీసీ కాలువలకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్లో భారీ అవినీతి జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పట్టణంలోని టీడీపీ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు కార్యాలయం లో మంగళవారం జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడుతూ వైసీపీ నేతలు, ఇరిగేషన్‌ అధికారులు కుమ్మక్కై పనులు సరి గా చేయలేదన్నారు. మట్టి, గ్రావెల్‌తో పూడ్చాల్సిన గండ్లును ఇసుకతో పూడ్చటంతో కొద్దిపాటి వర్షాలకే అవి జారిపోతున్నాయన్నారు. ఏలేరు, పీబీసీ పరిధిలో గండ్లు అసంపూర్తిగా పూడ్చడం వల్ల సుమారు 10వేల ఎకరాల్లో పొలాలకు ముంపు ప్రమాదం పొంచిఉందన్నారు. ఏమాత్రం అధిక వర్షా లు వచ్చినా గండ్లు అన్నీ కొట్టుకుపోతాయని తెలిపారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో జరిగిన పనులపై సమగ్ర విచారణ జరిపించాలని, మళ్లీ పటిష్టంగా పూడ్చాలని వర్మ డిమాండ్‌ చేశారు. సమావేశంలో టీడీపీ పట్టణ, మండల అధ్యక్షులు గుండ్ర సుబ్బారావు, ఉలవకాయల దేవేంద్రుడు, నగర  పంచాయతీ మాజీ చైర్మన్‌ శీరం మాణిక్యం, మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్‌, బస్సా సత్యనారాయణ, గండే నాగేశ్వరరావు, పడాల రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T05:17:43+05:30 IST