భావోద్వేగాలకు దృశ్యరూపం ఫొటోలు
ABN , First Publish Date - 2022-08-20T06:06:24+05:30 IST
మనిషిలోని భావోద్వేగాలను బయటకు తీసేవి ఫొటోలని ఎమ్మెల్సీ సురభివాణి
రవీంద్రభారతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మనిషిలోని భావోద్వేగాలను బయటకు తీసేవి ఫొటోలని ఎమ్మెల్సీ సురభివాణి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సురభి వాణి చిత్రాలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, విద్యశ్రీ, సినిమాటోగ్రఫర్ గోపిగణే్షతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా సురభివాణి మాట్లాడుతూ వెయ్యి అక్షరాలు చెప్పే విషయాన్ని ఒక్క ఫొటో తెలియజేస్తుందని అన్నా రు. సమాజాన్ని చైతన్యపరిచే చిత్రాలను అందించాలన్నారు. ఇలాంటి ఛాయచిత్ర ప్రదర్శనల ద్వారా ఫొటోగ్రాఫర్ల ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అజితాసురభితో పాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.