రేపట్నుంచి పీజీ సెమిస్టర్‌

ABN , First Publish Date - 2020-09-27T08:16:41+05:30 IST

స్థానిక ఆర్ట్స్‌ కళాశాల పీజీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 28న ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్‌ నాగలింగారెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు...

రేపట్నుంచి పీజీ సెమిస్టర్‌

అనంతపురం విద్య, సెప్టెంబరు: స్థానిక ఆర్ట్స్‌ కళాశాల పీజీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 28న ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల్‌ నాగలింగారెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. అనంతపురం కేంద్రంలో పరీక్షలుంటాయన్నారు. ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశామన్నారు. అక్టోబరు 5వ తేదీ నుంచి డిగ్రీ నాలుగు, రెండో సెమిస్టర్‌ (సప్లిమెంటరీ) పరీక్షలుంటాయని ఆయన పేర్కొన్నారు. నాలుగో సెమిస్టర్‌ ఉదయం, రెండో సెమిస్టర్‌ పరీక్షలు మధ్యాహ్నం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-09-27T08:16:41+05:30 IST