18వ రోజు కూడా పెరగని పెట్రోల్- డీజిల్ ధరలు!

ABN , First Publish Date - 2021-08-04T14:11:50+05:30 IST

వరుసగా 18వ రోజు(ఈరోజు) కూడా ప్రభుత్వ చమురు సంస్థలు...

18వ రోజు కూడా పెరగని పెట్రోల్- డీజిల్ ధరలు!

న్యూఢిల్లీ: వరుసగా 18వ రోజు(ఈరోజు) కూడా ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్-డీజిల్ ధరలలో మార్పులు చేయలేదు. జూలై 18 నుంచి భారత్‌లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరు రూ.101.84గా ఉండగా, డీజిల్ లీటరు ధర రూ. 89.87గా ఉంది. ముంబై మహానగరంలో లీటరు పెట్రోలు ధర మే 29 నాటికే వంద రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ.107.83గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే లీటరు రూ.97.45గా ఉంది. ఈ విధంగా ఇంధన ధరలు నిలకడగా ఉండడానికి ప్రపంచ ఇంధన మార్కెట్‌లో ధరలు పడిపోవడంమే ప్రధాన కారణం.

Updated Date - 2021-08-04T14:11:50+05:30 IST