పెట్రోల్‌, డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌

ABN , First Publish Date - 2020-04-10T07:17:36+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఇంధన వినియోగం 66శాతం మేర తగ్గిపోయిందని చమురు సంస్థలు..

పెట్రోల్‌, డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌

  • ఇంధన వినియోగం 66 శాతం తగ్గుదల

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: లాక్‌డౌన్‌  కారణంగా దేశంలో ఇంధన వినియోగం 66శాతం మేర తగ్గిపోయిందని చమురు సంస్థలు వెల్లడించాయి. ఆర్థిక కార్యకలాపాలు, రవాణా నిలిచిపోవడం వల్ల పెట్రోల్‌, డీజిల్‌లకు డిమాండ్‌ తగ్గింది. ఇక విమానాల్లో వాడే ఇంధనం - ఏటీఎఫ్‌ వినియోగమైతే ఏకంగా 90ు మేర పడిపోయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశం అయిన భారత్‌లో మార్చిలో 17.79ు పెట్రోలు, 24.43ు డీజిల్‌, 32.4ు ఏటీఎఫ్‌ మాత్రమే వాడినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వంటగ్యా్‌సకు మాత్రం తెగ గిరాకీ ఏర్పడింది.  

Updated Date - 2020-04-10T07:17:36+05:30 IST