‘పేట’ ప్రజలకు రుణపడి ఉంటా..
ABN , First Publish Date - 2021-03-05T06:24:50+05:30 IST
నియోజకవర్గ ప్రజలకు తాను ఆ జన్మాంతం రుణపడి ఉంటానని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే ‘చెంగల’
నక్కపల్లి, మార్చి 4 : నియోజకవర్గ ప్రజలకు తాను ఆ జన్మాంతం రుణపడి ఉంటానని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఉపమాక వెంకన్నను దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. జీవితంలో ఎత్తుపల్లాలన్నీ చూశానని, నియోజకవర్గ ప్రజల ద్వారా మరోసారి తనకు అవకాశం వస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. ఏ ఆస్తులు సంపాదించు కోలే దని, కానీ ప్రజల అభిమానం సంపాదించానని అన్నారు.
గెడ్డం బుజ్జిని కలిసిన ‘చెంగల’
పాయకరావుపేట రూరల్ : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు గురువారం తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి గుంటపల్లి గ్రామంలో జీసీఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డం బుజ్జిని కలిశారు. భవిష్యత్తు రాజకీయాలపై కాసేపు చర్చించారని సమాచారం. గెడ్డం బుజ్జి, గెడ్డం కన్నబాబు, పల్లి దుర్గ తదితరులు పాల్గొన్నారు.