‘పేట’ ప్రజలకు రుణపడి ఉంటా..

ABN , First Publish Date - 2021-03-05T06:24:50+05:30 IST

నియోజకవర్గ ప్రజలకు తాను ఆ జన్మాంతం రుణపడి ఉంటానని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్‌ అన్నారు.

‘పేట’ ప్రజలకు రుణపడి ఉంటా..
విలేఖరులతో మాట్లాడుతున్న చెంగల వెంకట్రావు

 మాజీ ఎమ్మెల్యే ‘చెంగల’

నక్కపల్లి, మార్చి 4 : నియోజకవర్గ ప్రజలకు తాను ఆ జన్మాంతం  రుణపడి ఉంటానని పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావ్‌ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఉపమాక వెంకన్నను దర్శించుకున్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. జీవితంలో  ఎత్తుపల్లాలన్నీ చూశానని, నియోజకవర్గ ప్రజల ద్వారా మరోసారి తనకు అవకాశం వస్తుందని నమ్ముతున్నానని చెప్పారు.  ఏ ఆస్తులు సంపాదించు కోలే దని, కానీ ప్రజల అభిమానం సంపాదించానని అన్నారు. 

    గెడ్డం బుజ్జిని కలిసిన ‘చెంగల’

పాయకరావుపేట రూరల్‌ : మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు గురువారం తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి గుంటపల్లి గ్రామంలో జీసీఆర్‌ ఫౌండేషన్‌ అధినేత గెడ్డం బుజ్జిని కలిశారు. భవిష్యత్తు రాజకీయాలపై కాసేపు చర్చించారని సమాచారం. గెడ్డం బుజ్జి, గెడ్డం కన్నబాబు, పల్లి దుర్గ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-05T06:24:50+05:30 IST