కార్పొరెట్ల కోసం పని చేయని ఏకైక పార్టీ బీఎస్పీ: మాయావతి

ABN , First Publish Date - 2022-02-10T22:49:59+05:30 IST

ఈ దేశంలో ఒక్క బీఎస్పీ మాత్రమే ధనవంతుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేసే ఏకైక రాజకీయ పార్టీ. మిగిలిన పార్టీలన్నీ కార్పొరెట్ల అనుకూల పార్టీలు. వాళ్లు ధనవంతుల జేబులు నింపడానికే పని చేస్తారు. వాళ్ల పాలసీలే అవి..

కార్పొరెట్ల కోసం పని చేయని ఏకైక పార్టీ బీఎస్పీ: మాయావతి

డెహ్రడూన్: ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయడానికి బదులు కొంత మంది సంపన్నుల కోసం పని చేస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి విమర్శలు గుప్పించారు. గురువారం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్టీల పాలసీలు కార్పొరెట్లకు అనుకూలంగా ఉంటాయని అందుకే అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని కొర్పొరెట్లకు దోచి పెడుతున్నారని అన్నారు. కార్పొరెట్ల కోసం పని చేయని పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క బీఎస్‌పీ మాత్రమే అని మాయా అన్నారు.


‘‘ఈ దేశంలో ఒక్క బీఎస్పీ మాత్రమే ధనవంతుల కోసం కాకుండా ప్రజల కోసం పని చేసే ఏకైక రాజకీయ పార్టీ. మిగిలిన పార్టీలన్నీ కార్పొరెట్ల అనుకూల పార్టీలు. వాళ్లు ధనవంతుల జేబులు నింపడానికే పని చేస్తారు. వాళ్ల పాలసీలే అవి. ఆ పార్టీలు అధికారంలోకి రాగానే వాళ్లు పెట్టే పథకాలు, చేసే పనులన్నీ కొంతమంది ధనవంతులకు మేలు చేసేవే. కానీ రాజకీయ అధికారాన్ని బీఎస్‌పీ అలా దుర్వినియోగం చేయదు. మా పాలసీనే ప్రజా సంక్షేమం, సమాజపురోగతి. మేము మాత్రమే అత్యుత్తమ పాలన అందిస్తాం’’ అని మాయావతి అన్నారు.

Updated Date - 2022-02-10T22:49:59+05:30 IST