ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాలి
ABN , First Publish Date - 2021-10-24T05:20:55+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కార్మికులతోపాటు ప్రజలు ఐక్యంగా ఉద్యమించి పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు అన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు
అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 23: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కార్మికులతోపాటు ప్రజలు ఐక్యంగా ఉద్యమించి పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.నరసింగరావు అన్నారు. విశాఖ పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భెల్ హెచ్పీవీపీ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కోటి సంతకాల సేకరణ వర్క్షాప్నకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా స్థాపించలేని కేంద్ర ప్రభుత్వం ఉన్న వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎం.జగ్గునాయుడు, వివిద సంస్థల నాయకులు జె.అయోధ్యరామ్, కె. కామేశ్వరి, జీటీపీ ప్రకాశ్, కుమార మంగళం, ఈఆర్ఎస్వీ కుమార్, గంగారావు తదితరులు పాల్గొన్నారు.