వైద్య చికిత్సకు అప్పుల తిప్పలు
ABN , First Publish Date - 2020-08-24T16:29:29+05:30 IST
గ్రామీణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రుణాలు తీసుకొని, వైద్య చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. గ్రామీణ భారతదేశంలో 13.4 శాతం మంది చికిత్స కోసం రుణాలు తీసుకుంటుండగా....
న్యూఢిల్లీ: గ్రామీణ భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రుణాలు తీసుకొని, వైద్య చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. గ్రామీణ భారతదేశంలో 13.4 శాతం మంది చికిత్స కోసం రుణాలు తీసుకుంటుండగా, దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 28 శాతం మంది ఈ జాబితాలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్తో సహా పలు పెద్ద రాష్ట్రాల్లో ఈ రేటు జాతీయ సగటు కంటే అధికంగా ఉంది. ఇటీవల జరిగిన ఎన్ఎస్ఎస్ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం అధికశాతం ప్రజలు తమ ఆరోగ్య సంరక్షణకు అప్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. గ్రామీణ భారతదేశంలోని 79.5 శాతం మంది ప్రజలు తమ ఆదాయాన్ని లేదా పొదుపును తమ వైద్యచికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు. 13.4 శాతం మంది వైద్య చికిత్సల కోసం రుణాలు తీసుకున్నారు. 0.4 శాతం మంది తమ ఆస్తులను అమ్ముకున్నారు. 3.4 శాతం మంది తమ స్నేహితులు, బంధువుల నుంచి సాయం పొందారు. గ్రామీణ భారతదేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 28.2 శాతం మంది రుణాలు తీసుకొని, వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ జాబితాలో రెండవ స్థానంలో కర్ణాటక ఉంది.