బీజేపీ పాలనలో సంక్షోభంలోకి ప్రజలు

ABN , First Publish Date - 2022-07-04T05:00:55+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ దేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టేసిందని ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఏ చిష్టి విమర్శించారు.

బీజేపీ పాలనలో సంక్షోభంలోకి ప్రజలు
ఆవాజ్‌ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర కన్వీనర్‌ చిష్టి

ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌  చిష్టి

బుచ్చిరెడ్డిపాళెం, జూలై 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ  దేశ ప్రజలను సంక్షోభంలోకి నెట్టేసిందని ఆవాజ్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఎంఏ చిష్టి విమర్శించారు.  స్థానిక షాదిమంజిల్‌లో ఆదివారంజరిగిన ఆవాజ్‌ 4వ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య  అతిథిగా మాట్లాడారు. గడచిన మూడేళ్లలో ముస్లిం మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం  అన్యాయం చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను తిప్పికొట్టా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 105జీవోతో దుల్హాన్‌ పథకం, విదేశీ విద్యను పక్కన పెట్టేసిందన్నారు.  మహాసభలో ముఖ్య అతిథులుగా ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎం. భాషా,  గౌరవ అధ్యక్షుడు మూలం రమేష్‌, కార్యదర్శి షేక్‌ రషీద్‌,  ఇలియాజ్‌ అహ్మద్‌, షేక్‌ కాలేషా భాషా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జానీబాషా, మండల కార్యదర్శి మునీర్‌ అహ్మద్‌,  శ్రీనివాసులు, మల్లికార్జున, రియాజ్‌, నాయబ్‌, నజీర్‌, మస్తాన్‌, జక్రియ, బాబు, శ్రీనివాసులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:00:55+05:30 IST