వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు
ABN , First Publish Date - 2022-08-19T05:05:32+05:30 IST
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు.
‘బాదుడే-బాదుడు’లో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 18: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుండ లక్ష్మీదేవి అన్నారు. నగరంలోని 34వ డివిజన్లో గురువారం రాత్రి బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. నిత్యావసరాల నుంచి బస్సు చార్జీలు, పెట్రో, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలు ఇలా అన్నింటిపై ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుడిపై అధికభారం మోపుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింతు సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.