ఘనంగా ముగిసిన పెంటమాబ అమ్మవారి ఉత్సవం

ABN , First Publish Date - 2022-05-17T06:02:58+05:30 IST

జింక్‌ గేటు సమీపంలో ఉన్న హిమాచల్‌నగర్‌ గ్రామ దేవత పెంటమాబ అమ్మవారి పండగ మహోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది.

ఘనంగా ముగిసిన పెంటమాబ అమ్మవారి ఉత్సవం
అమ్మవారిని దర్శంచుకుంటున్న నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి తదితరులు

మల్కాపురం,  మే 16 : జింక్‌ గేటు సమీపంలో ఉన్న హిమాచల్‌నగర్‌ గ్రామ దేవత పెంటమాబ అమ్మవారి పండగ మహోత్సవం సోమవారం ఘనంగా ముగిసింది. అమ్మవారి ఆలయ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గత ఐదు రోజులుగా పండగను నిర్వహించారు. పండగ ఆఖరి రోజు నగర మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు,  స్థానిక కార్పొరేటర్‌ పుర్రె పూర్ణశ్రీ , 59వ వార్డు వైసీపీ అధ్యక్షుడు పుర్రె సురేశ్‌ యాదవ్‌లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండగ సందర్భంగా ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు.  ఈ పరసలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నమ్మి గౌరీశ్వరరావు, ధర్మకర్త నమ్మి అచ్చియ్యమ్మ, పొట్టి మూర్తి , తొనంగి  రమణి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:02:58+05:30 IST