పింఛన్లకు పైసల్లేవ్ కానీ..
ABN , First Publish Date - 2022-06-03T09:39:58+05:30 IST
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్
రూ. కోట్లతో ప్రకటనలా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్, జూన్ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు పత్రికల్లో భారీ ప్రకటనలు ఇవ్వడాన్ని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. పింఛన్లు లేక అవ్వా తాతలు ఏడుస్తుంటే.. ఏం వెలగపెట్టారని ఇతర రాష్ట్రాల పత్రికలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని రూ. 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని. ఈ దోపిడీ మీకింకా సరిపోలేదా..? అని గురువారం ఓ ట్వీట్ చేశారు.