స్వచ్ఛసర్వేక్షణ్‌ సూర్యాపేట బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2022-01-21T05:59:56+05:30 IST

సూర్యాపేట మునిసిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జిల్లా కేంద్రానికి పెద్దిరెడ్డి గణేష్‌ నియమితులయ్యారు.

స్వచ్ఛసర్వేక్షణ్‌ సూర్యాపేట బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెద్దిరెడ్డి
పెద్దిరెడ్డి గణేష్‌కు నియామకపత్రం అందజేస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డి

సూర్యాపేటటౌన్‌, జనవరి 20: సూర్యాపేట మునిసిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జిల్లా కేంద్రానికి పెద్దిరెడ్డి గణేష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సూర్యాపేట మునిసిపాలిటీ పాలకవర్గం నిర్ణయించింది. మునిసిపల్‌ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌పై ఆయన ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియామకపత్రాన్ని పెద్దిరెడ్డికి మంత్రి జగదీ్‌షరెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్యం, పర్యావరణ, సాంస్కృతిక పురోగతికి ప్రజలంతా సహకరించాలని సూచించారు. జాతీయ స్థాయిలో గతంలో కన్నా ముందుగా ర్యాంక్‌ సాధించేందుకు కృషి చేయాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, వై.వెంకటేశ్వర్లు, పెద్దగట్టు లింగమంతులస్వామి దేవాలయ చైర్మన్‌ కోడి సైదులుయాదవ్‌, సవరాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మరో మూడు నెలల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు కేంద్రం పట్టణాలను ఎంపిక చేయ నుంది. ఈ తరుణంలో పట్టణానికి అవార్డు వచ్చేలా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గణేష్‌ కృషి చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-21T05:59:56+05:30 IST