పేదవాడి కడుపు నింపడమే లక్ష్యం : జనసేన

ABN , First Publish Date - 2022-06-24T04:00:37+05:30 IST

డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతిపేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో కావలిలో పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించినట్లు ప

పేదవాడి కడుపు నింపడమే లక్ష్యం : జనసేన
పేదలకు అన్నం పెడుతున్న పవన్‌ అభిమానులు, జనసేన నేతలు

కావలి, జూన్‌23: డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ప్రతిపేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో  కావలిలో పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించినట్లు పవన్‌ కల్యాణ్‌ అభిమాన సంఘ, జనసేన నాయకుడు సిద్దు తెలిపారు. పట్టణ ఏరియా వైద్యశాలలో గురువారం పవనన్న పేదల అన్నం బండిని ప్రారంభించి, 100 మంది ఆకలి తీర్చారు. అనంతరం సిద్దూ మాట్లాడుతూ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఏరియా ఆసుపత్రి ముందు, బ్రిడ్జి సెంటర్‌లో ఈ అన్నం బండి ఉంటుందన్నారు. ప్రతి పేదవాడికి రుచికరమైన అన్నం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తోట వెంకటశేషయ్య, ఎస్‌. మల్లి, తిరుపతి స్వామి, మనోజ్‌, మౌలాలి, చంటి, విజయ్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-24T04:00:37+05:30 IST