ప్రశాంతంగా పాలిసెట్-2022
ABN , First Publish Date - 2022-07-01T06:13:11+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ప్రశాంతంగా ముగిసాయి.
పెద్దపల్లి కల్చరల్, జూన్ 30 : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన పాలిసెట్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ప్రశాంతంగా ముగిసాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 8 పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఒక్కోక్క పరీక్ష కేంద్రానికి అబ్జర్వర్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్ , రూట్ ఆఫీసర్లను నియమించారు. ఆయా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముం దుగానే చేరుకున్నారు. హల్ టికెట్ నెంబర్లను చూసుకోని పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు. మొత్తం 3147 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 2927 మంది రాశారు. జిల్లా వ్యాప్తంగా 220 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా కో ఆర్డినేటర్ కుమార్ సతీష్ అబ్జర్వర్లు శ్రీనివాన్, రాంరెడ్డితోపాటు పలువురు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.