ఆల్తూరుపాడు రైతులకు నష్టపరిహారం చెల్లించండి
ABN , First Publish Date - 2022-01-23T03:26:03+05:30 IST
ఆల్తూరుపాడు రిజర్వాయరు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనరు గద్దల మునెయ్య ఆధ్వర్యంలో రైతులు ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు.
డక్కిలి, జనవరి 22 : ఆల్తూరుపాడు రిజర్వాయరు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనరు గద్దల మునెయ్య ఆధ్వర్యంలో రైతులు ఆర్డీవోకు విజ్ఞప్తి చేశారు. శనివారం డక్కిలి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో మురళీకృష్ణ ఓటీఎస్పై సిబ్బందితో సమీక్షించారు. నిర్ణీత సమయంలోగా వసూళ్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆల్తూరుపారు రైతులు ఆర్డీవోని కలిశారు. రిజర్వాయరు కోసం తాము సాగుభూములు వదులుకోవాల్సి వచ్చిందన్నారు. ఏన్నో ఏళ్ల నుంచి తాము సాగుచేసుకుంటున్నా పట్టాలు మంజూరు చేయలేదన్నారు. ఫలితంగా తాము భూములు కోల్పోయినా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. త్వరలో తాను క్షేత్రస్తాయి పరిశీలన చేసి న్యాయం చేస్తామని ఆర్డీవో వారికి హామీ ఇచ్చారు.