వైభవంగా పట్టాభిరామస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం

ABN , First Publish Date - 2022-08-11T03:25:52+05:30 IST

ముదిరాజు కాల నీలో పట్టాభిరామ స్వామి విగ్రహం, ధ్వజ కల శ, హనుమ సమేత మహాకుంభాభిషేక ప్ర తిష్ఠ మహోత్సవం బుధవారం వైభవంగా జరి గింది.

వైభవంగా పట్టాభిరామస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం
ధ్వజ స్తంభ ప్రతిష్ఠలో పాల్గొన్న భక్తులు

తర్లుపాడు, ఆగస్టు 10:  ముదిరాజు కాల నీలో పట్టాభిరామ స్వామి విగ్రహం, ధ్వజ కల శ, హనుమ సమేత మహాకుంభాభిషేక ప్ర తిష్ఠ మహోత్సవం బుధవారం వైభవంగా జరి గింది. వేద పండితులు బ్రహ్మశ్రీ ఓరుగంటి సీతారామశర్మ ఆధ్వ ర్యంలో 9.30 నిమిషాలకు ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్ర మం జరిగింది. ఉదయం ప్రాతఃకాల పూజ, ప్రతిష్ఠ హోమం, శాంతి పౌష్టిక హోమాలు, కట్టపూజ, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ, గోపుర, కలిశ శిఖర ప్రతిష్ఠ, మహా కుంభా భిషేకం, ధ్వజ ప్రతిష్ఠ, వింభాకలాభినాషం,  పూర్ణాహుతి కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కుం దురు నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, ఎంపీపీ ఎస్‌.భూలక్ష్మి, జడ్పీ టీసీ సభ్యుడు వెన్నా ఇందిర పూజల్లో పా ల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. 

12న రాష్ట్ర స్థాయి 

బండలాగుడు పోటీలు 

తర్లుపాడు పంచాయ తీలోని నాయుడుపల్లెలో సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి, పోలేరమ్మ, పోతురాజు సాక్షి గణపతి, నాగేంద్ర స్వామి, ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఈ నెల 12న రాష్ట్ర స్థాయి సీనియర్‌ విభాగం బండ లాగుడు పోటీలు నిర్వ హిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు రూ.1000 డిపాజిట్‌ చేసి రసీదు పొం దాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.40, తృతీయ రూ.30, నాల్గో బహుమతి రూ.20, ఐదో బహు మతిగా రూ.15 వేలు, ఆరో బహుమతిగా రూ.10 వేలు ఇవ్వ నున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు 93982 96492, 9441745183 నెం బర్లకు సంప్రదించాలని వారు కోరారు.


Updated Date - 2022-08-11T03:25:52+05:30 IST