పట్టాభీ... నోరు అదుపులో పెట్టుకో!
ABN , First Publish Date - 2021-10-20T05:30:00+05:30 IST
సీఎం జగన్ను విమర్శించే అర్హత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి లేదని ఏపీఎండీసీ చైర్పర్సన్ జి.షమీంఅస్లాం అన్నారు. సీఎంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మహిళలే తగిన గుణపాఠం చెబుతునారని షమీంఅస్లాం పేర్కొన్నారు.
ఏపీఎండీసీ చైర్పర్సన్ షమీంఅస్లాం
మదనపల్లె, అక్టోబరు 20: సీఎం జగన్ను విమర్శించే అర్హత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభికి లేదని ఏపీఎండీసీ చైర్పర్సన్ జి.షమీంఅస్లాం అన్నారు. ఇక్కడి ఎండీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుంటే చూసి ఓర్వలేక మాజీ సీఎం చంద్రబాబు... పట్టాభితో వ్యక్తి గత దూషణలు చేయిస్తున్నారన్నారు. సీఎంపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మహిళలే తగిన గుణపాఠం చెబుతునారని షమీంఅస్లాం పేర్కొన్నారు. షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ రఫి, ఇర్ఫాన్ఖాన్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.