టీడీఆర్ బాండ్లరూపంలో వైసీపీ ఎమ్మెల్యే భారీ అవినీతి: పట్టాభి

ABN , First Publish Date - 2022-03-13T19:50:25+05:30 IST

వైసీపీ అక్రమాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శించారు.

టీడీఆర్ బాండ్లరూపంలో వైసీపీ ఎమ్మెల్యే భారీ అవినీతి: పట్టాభి

అమరావతి: వైసీపీ అక్రమాలకు హద్దే లేకుండా పోయిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల రూపంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బినామీల పేరుతో భూములు కొనిపించి.. వాటిని అభివృద్ధి పేరుతో.. ఎమ్మెల్యే నాగేశ్వరరావు తణుకు మున్సిపాలిటీకి అంటగట్టారన్నారు. దీనికోసం తన బినామీలకు టీడీఆర్ బాండ్లు ఇప్పించారని, ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పట్టాభి విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే అవినీతిపై సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్ల అవినీతిపై.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-13T19:50:25+05:30 IST