జగన్ సైకోలా వ్యవహరిస్తున్నాడు: పట్టాభి
ABN , First Publish Date - 2022-06-19T19:12:36+05:30 IST
అమరావతి: రోజురోజుకి తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్నవ్యతిరేకత ... చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక జగన్ మోహన్ రెడ్డి ఒక సైకోలా
అమరావతి: రోజురోజుకి తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో వస్తున్నవ్యతిరేకత ... చంద్రబాబుకు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక జగన్ మోహన్ రెడ్డి ఒక సైకోలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ నాయకుడు పట్టాభి విమర్శించారు. అయ్యన్నపాత్రుడిది మచ్చలేని కుటుంబం అని..ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా జగన్పై పోరాటం చేస్తున్నారని తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకుంది 0.2 సెంట్లు.... అంటే 10 గజాలు లోపేనని.. దీనికి వంద మంది పోలీసులు, జేసీబీలు, ఐపీఎస్ అధికారులు అవసరమా? అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ అంటే వైసీపీ చేతి కర్రగా మారడం బాధాకరమన్నారు.