ట్రాన్స్జెండర్ల పరేడ్...తమ పెళ్లిళ్లకు గుర్తింపు నివ్వాలని డిమాండ్!
ABN , First Publish Date - 2021-07-15T16:33:30+05:30 IST
బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ హైస్కూల్...
పట్నా: బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ హైస్కూల్ ప్రాంగణంలో దోస్తానా సఫర్ ఆధ్వర్యంలో ఈరోజు బీహార్ ప్రైడ్ పరేడ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్జండర్లు తమ పెళ్లిళ్లకూ గుర్తింపు నివ్వాలని కోరుతూ పరేడ్ నిర్వహించనున్నారు. బీహార్ ప్రైమ్ పరేడ్ను వరుసగా మూడవ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బయోసెక్సువల్ ఇంటర్ సెక్స్ కేర్ ట్రాన్స్జండర్ సముదాయానికి చెందిన 200 మంది హాజరు కానున్నారు. ఈ పరేడ్లో స్వలింగ సంపర్కులు, ట్రాన్స్ జండర్ సముదాయానికి చెందినవారు హాజరై, తమకు సామాజిక గుర్తింపునివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.