రాజ్యసభకు పార్థసారథిరెడ్డి, దామోదర్రావు నామినేషన్
ABN , First Publish Date - 2022-05-26T10:52:00+05:30 IST
హైదరాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, నమేస్త తెలంగాణ
-పాల్గొన్న మంత్రులు హరీశ్, మహమూద్ అలీ, సబితారెడ్డి
హైదరాబాద్, మే 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు అధికార టీఆర్ఎస్ అభ్యర్థులుగా హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, నమేస్త తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు బుధవారం నామినేషన్లు సమర్పించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్ నరసింహాచార్యులుకు అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం, వారిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తన్నీరు హరీశ్రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తాతా మధు పాల్గొన్నారు. పార్థసారథిరెడ్డి, దామోదర్రావు నుంచి రెండు సెట్ల నామినేషన్లను స్వీకరించినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా్సరాజ్ తెలిపారు. కాగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర.. కుటుంబంతో సీఎం కేసీఆర్ని కలిశారు. పార్థసారధిరెడ్డి, దామోదర్రావు కూడా సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.