ప్రకాష్సింగ్ బాదల్కు కొవిడ్ పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-20T14:00:00+05:30 IST
పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ ప్యాట్రన్ ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా పాజిటివ్...
లూథియానా: పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ ప్యాట్రన్ ప్రకాష్ సింగ్ బాదల్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 94 ఏళ్ల వయసుగల వెటరన్ రాజకీయ నాయకుడైన బాదల్ కు కొవిడ్ లక్షణాలుండటంతో అతన్ని లూథియానాలోని దయానంద్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.బాదల్ కు స్వల్ప జ్వరం, గొంతునొప్పి, జలుబు, దగ్గు ఉన్నాయని డాక్టర్ బిషవ్ మోహన్ చెప్పారు. బాదల్ ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యుల బృందం పర్యవేక్షిస్తుందని శిరోమణి అకాలీదళ్ పార్టీ లూథియానా అభ్యర్థి మహీ షిందర్ సింగ్ చెప్పారు. ప్రకాష్ సింగ్ బాదల్ కరోనా నుంచి కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.