జే బ్రాండ్లతో మద్యంప్రియులకు పక్షవాతం
ABN , First Publish Date - 2022-07-03T06:42:33+05:30 IST
దిక్కుమాలిన జే బ్రాండ్ల వలన మద్యం ప్రియులకు పక్షవాతం వ్యాధి వస్తుందని మాజీవ ుంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
తోలుకోడు బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని ఉమా
మైలవరం రూరల్, జూలై 2: దిక్కుమాలిన జే బ్రాండ్ల వలన మద్యం ప్రియులకు పక్షవాతం వ్యాధి వస్తుందని మాజీవ ుంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.తోలుకోడులో శనివారం బాదుడే - బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఉమా మాట్లాడుతూ మద్యం పేర్లు తెలియక మందుబాబులు ఆ బాటిల్ ఇవ్వు, ఈ బాటిల్ ఇవ్వు అంటున్నారని, ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడు తుందన్నారు. మద్యపానం నిషేధం చేస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు వేమిశెట్టి నాగేశ్వరరావు, మల్లెల శ్రీనివాసరావు, నంబూరి శ్యాంప్రసాద్, దొండపాటి విజయ్, తదితరులు పాల్గొన్నారు.