జే బ్రాండ్లతో మద్యంప్రియులకు పక్షవాతం

ABN , First Publish Date - 2022-07-03T06:42:33+05:30 IST

దిక్కుమాలిన జే బ్రాండ్ల వలన మద్యం ప్రియులకు పక్షవాతం వ్యాధి వస్తుందని మాజీవ ుంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

జే బ్రాండ్లతో మద్యంప్రియులకు పక్షవాతం
ప్రజలకు అభివాదం చేస్తున్న దేవినేని ఉమా

తోలుకోడు బాదుడే - బాదుడులో మాజీ మంత్రి దేవినేని  ఉమా 

మైలవరం రూరల్‌, జూలై 2: దిక్కుమాలిన జే బ్రాండ్ల వలన మద్యం ప్రియులకు పక్షవాతం వ్యాధి వస్తుందని మాజీవ ుంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.తోలుకోడులో శనివారం బాదుడే - బాదుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఉమా మాట్లాడుతూ మద్యం పేర్లు తెలియక మందుబాబులు ఆ బాటిల్‌ ఇవ్వు, ఈ బాటిల్‌ ఇవ్వు అంటున్నారని, ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడు తుందన్నారు.  మద్యపానం నిషేధం చేస్తానన్న జగన్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు.  గ్రామ పార్టీ అధ్యక్షుడు వేమిశెట్టి నాగేశ్వరరావు, మల్లెల శ్రీనివాసరావు, నంబూరి శ్యాంప్రసాద్‌, దొండపాటి విజయ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-03T06:42:33+05:30 IST